Share News

పేదల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:10 AM

పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసే న-టీడీపీ-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్‌ అన్నారు. గురువారం నిడదవో లులోని 7,9,10,11 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్‌ నొక్కుతూ ప్రజలను మఽభ్యపెట్టే ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహిం చారని, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసేది కూటమి ప్రభుత్వమేనన్నారు.

పేదల సమస్యల పరిష్కారానికి కృషి

  • ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్‌

నిడదవోలు, ఏప్రిల్‌ 25: పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసే న-టీడీపీ-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్‌ అన్నారు. గురువారం నిడదవో లులోని 7,9,10,11 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్‌ నొక్కుతూ ప్రజలను మఽభ్యపెట్టే ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహిం చారని, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసేది కూటమి ప్రభుత్వమేనన్నారు. ఓటర్లు తనకు గాజు గ్లాసు గుర్తుపైనా, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపైన, ఓటు వేసి విజయం అందించాలన్నారు. 9వ వార్డులో వైసీపీకి చెందిన ముస్లిం నాయకులు ఎండీ హైదర్‌, ఎన్‌ఎ రహీమ్‌, షేక్‌ కలీద్‌బాబు, షరీఫ్‌తోపాటు మాజీ కౌన్సిలర్‌ ఉసురుమర్తి సరస్వతి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ దుర్గేష్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమాల్లో కొమ్మిన వెంకటేశ్వరరావు, రంగా రమేష్‌, నిమ్మగడ్డ గోపాలకృష్ణ, ఎండీ అక్రమ్‌, ఎండీ షాజహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:10 AM