Share News

జాతీయ రహదారిపై వాహన తనిఖీలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:17 AM

పిఠాపురం/గొల్లప్రోలు, జూన్‌ 4: కౌంటింగ్‌ నేపథ్యంలో కాకినాడ వెళ్లే వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. కాకినాడ-కత్తిపూడి జాతీయ రహదారిపై గల గొల్లప్రోలు టోల్‌ప్లాజా, చిత్రాడ మహాలక్ష్మి గుడి, పిఠాపురం బైపాస్‌రోడ్డులో పాదగయ జంక్షన్‌, సామర్లకోట

జాతీయ రహదారిపై వాహన తనిఖీలు
గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్పీ రామ్మోహనరావు

పిఠాపురం/గొల్లప్రోలు, జూన్‌ 4: కౌంటింగ్‌ నేపథ్యంలో కాకినాడ వెళ్లే వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. కాకినాడ-కత్తిపూడి జాతీయ రహదారిపై గల గొల్లప్రోలు టోల్‌ప్లాజా, చిత్రాడ మహాలక్ష్మి గుడి, పిఠాపురం బైపాస్‌రోడ్డులో పాదగయ జంక్షన్‌, సామర్లకోట రోడ్డులో కందరాడ-ఎఫ్‌కేపాలెం సెంటర్‌, ఉప్పాడ సెంటర్‌ల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, ఇతర వాహనాలను ఆపి తనిఖీ చేశారు. కాకినాడ వెళ్లే వారిని వెనక్కి పంపివేశారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక పర్యవేక్షణాధికారిగా నియమితులయిన ఎస్పీ రామ్మోహనరావు స్వయంగా వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. పలుచోట్ల వాహనాలను ఆపి వారు ఎక్కడకు వెళ్లుతున్నది ఆరా తీశారు. తనిఖీల్లో ట్రైనీ డీఎస్పీ ప్రమోద్‌, పిఠాపురం సీఐ శ్రీనివాస్‌, సర్కిల్‌లోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 01:17 AM