Share News

పోలీస్‌ అధికారుల స్థానాల మార్పు

ABN , Publish Date - May 26 , 2024 | 01:20 AM

వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు పోలీస్‌ అధి కారులను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత బాధ్యతలతోపాటు వారు పనిచేస్తున్న స్థానాలను మారుస్తూ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శనివారం ఉత్త ర్వులు జారీచేశారు.

పోలీస్‌ అధికారుల స్థానాల మార్పు

కాకినాడ క్రైం, మే 25 : వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు పోలీస్‌ అధి కారులను ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత బాధ్యతలతోపాటు వారు పనిచేస్తున్న స్థానాలను మారుస్తూ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శనివారం ఉత్త ర్వులు జారీచేశారు. తిరుపతి సెబ్‌ అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న ఎ.రాజేంద్రకు ముందుగా కాకినాడ జిల్లాకు కేటాయించారు. అయితే హోంశాఖ ఆ కేటాయింపును సవరించి తిరుపతి ఎస్పీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సెబ్‌ అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న జి.వెంకటరాముడుకు తొలుత కాకినాడ జిల్లాకు కేటాయించి అనంతరం సవరణలో భాగంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఎస్పీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. ఏసీబీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌.సత్యానందంను తొలుత వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు కేటాయించి సవరణ అనంతరం కాకినాడ జిల్లా ఎస్పీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. కాకినాడ జిల్లా సెబ్‌ అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న కె.శ్రీలక్ష్మిని తొలుత ప్రకాశం జిల్లాకు కేటాయించి సవరణ అనంతరం కాకినాడ జిల్లా ఎస్పీకి రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ఇక ఆక్టోపస్‌ డీస్పీగా పనిచేస్తున్న టి.నరసింహరావును తొలుత కాకినాడ జిల్లాకు కేటాయించి అనంతరం పల్నాడు ఎస్పీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న సిహెచ్‌ పాపారావుకు ముందుగా పల్నాడు జిల్లాకు కేటాయించి అనంతరం సవరణలో కాకినా డ ఎస్పీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా డీజీపీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 26 , 2024 | 01:20 AM