Share News

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మార్చ్‌ఫాస్ట్‌

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:53 AM

ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ సూచించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు  కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మార్చ్‌ఫాస్ట్‌

అమలాపురం టౌన్‌, మార్చి 8: ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ సూచించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు దళాలు, కేంద్ర బలగాలతో కలిసి శుక్రవారం మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలతోపాటు పోలింగ్‌ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. అమలాపురం పట్టణ పరిధిలోని కొంకాపల్లి, కురసాలవీధి, భూపయ్య అగ్రహారం, వడ్డిగూడెం, సూర్యనగర్‌, హైస్కూలు సెంటర్‌, విత్తనాల కాల్వగట్టు ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతు నిర్వహించారు. పట్టణ ఎస్‌ఐ కిస్టఫర్‌తోపాటు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 08:02 AM