ఫూలే చూపిన బాటలోనే పయనం
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:05 AM
పిఠాపురం, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావుఫూలే చూపిన బాటలోనే టీడీపీ పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావుఫూలే జయంతిని గురువారం నిర్వహించారు
![ఫూలే చూపిన బాటలోనే పయనం](https://media.andhrajyothy.com/media/2024/20240407/11ptp6_1509bfd33f.gif)
పిఠాపురం, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావుఫూలే చూపిన బాటలోనే టీడీపీ పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావుఫూలే జయంతిని గురువారం నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి వర్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అన్నారు. మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.