పొత్తు ధర్మాన్ని పాటించి పవన్ను గెలిపిద్దాం
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:40 PM
గొల్లప్రోలు రూరల్, మార్చి 18: పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన అధినేత పవన్కల్యాణ్ను గెలిపిద్దామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి సగరిపేట వద్ద బీసీ, ఎస్సీల అవగాహనా సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కార్యకర్తలు, నా యకులకు అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు. ఎవ్వ రు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ కార్యాలయం
![పొత్తు ధర్మాన్ని పాటించి పవన్ను గెలిపిద్దాం](https://media.andhrajyothy.com/media/2024/20240313/18ptp9_1ca25e2574.gif)
మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలు రూరల్, మార్చి 18: పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన అధినేత పవన్కల్యాణ్ను గెలిపిద్దామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి సగరిపేట వద్ద బీసీ, ఎస్సీల అవగాహనా సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కార్యకర్తలు, నా యకులకు అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు. ఎవ్వ రు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ కార్యాలయం ఎల్లప్పుడు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంద న్నారు. గ్రామానికి చేర్చి పట్టాలు ఇస్తామని, డ్రెయిన్లు, రోడ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. చెందుర్తి వాసులకు 5 కిలోమీటర్ల దూరంలో పట్టాలు ఇస్తే ఎలా వెళ్లతారని ప్రశ్నించారు. అంతకుముందు దుర్గాడకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు వర్మను కలిశారు. కార్యక్రమాల్లో టీడీపీ మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సకుమళ్ల గంగాధర్, మల్లిపూడి వీరబాబు, మడికి ప్రసాద్, బోనబోయిన శివ, మట్ల శ్రీను, తాటిపర్తి త్రిమూర్తులు, నక్కా రాంబాబు, భద్రరావు ఉన్నారు.