పవన్ అధిక మెజార్టీతో విజయం సాధిస్తారు
ABN , Publish Date - May 29 , 2024 | 11:33 PM
పిఠాపురం, మే 29: రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ విజయం సాధించబోతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబుని బుధవారం రాత్రి వర్మ కలిశారు. పవ న్ రికార్డుస్థా
![పవన్ అధిక మెజార్టీతో విజయం సాధిస్తారు](https://media.andhrajyothy.com/media/2024/20240511/29ptp14_608bf4961b.gif)
పిఠాపురం, మే 29: రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ విజయం సాధించబోతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబుని బుధవారం రాత్రి వర్మ కలిశారు. పవ న్ రికార్డుస్థాయి మెజార్టీతో విజయం సాధిస్తున్న విషయాన్ని చంద్రబాబుకు తెలియజేశారు. టీడీపీ ఓటు బ్యాంకు నూటికి నూరుశాతం జనసేనకు బదిలీ అయి ందని.. పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు పవన్ విజయం కోసం పనిచేసినట్టు వివరించారు. జనసేన గెలుపు కోసం తానే అభ్యర్థి మాదిరిగా వర్మ, పార్టీ కేడర్ పనిచేసిన తీరుని చంద్రబాబు ప్రశంసించారు. వర్మను ప్రత్యేకంగా అభినందించారు.