అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:30 AM
నాగులాపల్లి (కొత్తపల్లి), జనవరి 29: గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజా సమస్యలను పరిష్క రించే నాయకుడిని ఎన్నుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాగులాపల్లిలో సోమవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారం టీ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు సూపర్సిక్స్ కరపత్రాలను వర్మ పంపిణీ చేశారు. ప్రతీ వీధిలో పర్యటిస్తూ ప్రజాసమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులనే ఎన్నికల్లో ఓటు ద్వా
![అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
నాగులాపల్లి (కొత్తపల్లి), జనవరి 29: గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజా సమస్యలను పరిష్క రించే నాయకుడిని ఎన్నుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాగులాపల్లిలో సోమవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారం టీ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు సూపర్సిక్స్ కరపత్రాలను వర్మ పంపిణీ చేశారు. ప్రతీ వీధిలో పర్యటిస్తూ ప్రజాసమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులనే ఎన్నికల్లో ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ప్రస్తుతం నియోజవర్గంలో ప్రజాప్రతినిధులు రైతు సమస్యలను ప్రజాసమస్యలను గాలికి వదిలేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏలేరు ప్రాజక్టును ఫేజ్2లో ఆధునికీకరించేందుకు రూ.150 కోట్లతో ప్రారంభించిన పనులను వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు రద్దు చేశారని ఆరోపించారు. ఏలేరులో 3టీఎంసీ నీటిని తు ని,తాండవకు ధారా దత్తం చేశారని విమర్శించారు. పేదల కష్టాల్లో వెన్నెంటే ఉండి, సమస్యల పట్ల నిరంతరం పోరా టం చేసే తనను వచ్చే ఎ న్నికల్లో ఆశ్వీరదించాలని వర్మ ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ కొత్తపల్లి మండలాధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి,టీడీపీ కార్యకర్తలున్నారు.