Share News

ఫొటోగ్రాఫర్లకు భద్రత కల్పించాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:29 AM

ఫొటోగ్రాఫర్లకు భద్రత కల్పించాలని కోరుతూ అమలాపురం ఫొటో అండ్‌ వీడియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో నిరసన తెలిపారు.

 ఫొటోగ్రాఫర్లకు భద్రత కల్పించాలి

అమలాపురం టౌన్‌, మార్చి 10: ఫొటోగ్రాఫర్లకు భద్రత కల్పించాలని కోరుతూ అమలాపురం ఫొటో అండ్‌ వీడియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో నిరసన తెలిపారు. విశాఖ జిల్లా మధురవాడకు చెందిన ఫొటోగ్రాఫర్‌ సాయిని ప్రోగ్రాం పేరుతో తీసుకువెళ్లి అతి కిరాతకంగా హత్యచేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. సాయి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ సీఐ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ఖ్వాజాబాబు, అధ్యక్షుడు నగేష్‌, కార్యదర్శి తాతాజీ, కోశాధికారి నాగేంద్ర, ఉపాధ్యక్షుడు పొట్టుపోతు నాగు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు రమణప్రసాద్‌, ఉషాకిరణ్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:29 AM