Share News

‘ఎన్నికల్లో విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి’

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:26 AM

పెద్దాపురం, జనవరి 4: ఎన్నికల్లో సెక్టోరియల్‌ అధికారులు తమ విధులను సమ ర్థవంతంగా నిర్వర్తించాలని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఆర్డీవో కార్యాలయం లో డీఎస్పీ కె.లతాకుమారీతో కలసి ఆయన నియోకవర్గానికి సంబంధించి ఎన్నికల మార్గదర్శకాలపై సెక్టోరియల్‌, పోలీస్‌, ఏఈఆర్వోలతో గురు

‘ఎన్నికల్లో విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి’

పెద్దాపురం, జనవరి 4: ఎన్నికల్లో సెక్టోరియల్‌ అధికారులు తమ విధులను సమ ర్థవంతంగా నిర్వర్తించాలని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఆర్డీవో కార్యాలయం లో డీఎస్పీ కె.లతాకుమారీతో కలసి ఆయన నియోకవర్గానికి సంబంధించి ఎన్నికల మార్గదర్శకాలపై సెక్టోరియల్‌, పోలీస్‌, ఏఈఆర్వోలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్టోరియల్‌ అధికారులు తమ పరిధిలో పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టిసారించాలన్నారు. పోలింగ్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల న్నారు. సిబ్బంది అంతా సమన్వయం చేసు కుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే ందుకు సహకరించాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించాలని, వాటికి సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ వజ్రపు జితేంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, సీఐ రవికుమార, ఎస్‌ఐ సురేష్‌, మున్సిపల్‌ మేనేజర్‌ జ్యోతీరాణీ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:26 AM