Share News

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి : రాజప్ప

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:26 AM

సామర్లకోట, జూన్‌ 2: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ నెల 4న కాకినాడలో జరగనున్న పెద్దాపురం అసెంబ్లీ, పార్లమెంట్‌ సిగ్మెంట్‌ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీడీపీ తరపున పా

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి : రాజప్ప

సామర్లకోట, జూన్‌ 2: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ నెల 4న కాకినాడలో జరగనున్న పెద్దాపురం అసెంబ్లీ, పార్లమెంట్‌ సిగ్మెంట్‌ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీడీపీ తరపున పాల్గొనే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. ఆదివారం సామర్లకోట మండలం హుస్సేన్‌పు రంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు చల్లా బుజ్జి, కోట అప్పారావు, చల్లా ప్రభాకరరావు తదితరులతో కలసి ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన మెళకువలను రాజప్ప వివరించా రు. ఎన్నికలలో అత్యంత కృషి చేసి పార్టీ విజయానికి సహకరించిన కార్యకర్తలను అభినందించారు. మాజీ జడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మిరామకృష్ణ తదితరులున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:26 AM