టీడీపీ కూటమిదే విజయం
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:43 AM
పెద్దాపురం, ఏప్రిల్ 24: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీ కూటమి ప్రభుత్వమే అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో ఆయన 28,29 వార్డుల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు ఆయా వార్డుల్లోని మహిళలు హారతులు ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత
ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం, ఏప్రిల్ 24: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీ కూటమి ప్రభుత్వమే అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో ఆయన 28,29 వార్డుల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు ఆయా వార్డుల్లోని మహిళలు హారతులు ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, ఎదిరించి పోరాడిన వారిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వైసీపీ తుంగలో తొక్కిందన్నారు. దోపిడీదారులను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సంసి ద్ధంగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిం చా లని కోరారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాగ్, రాజాసూ రిబాబురాజు, గుత్తుల సూర్వాతీ శ్రీనివాస్ పాల్గొన్నారు.