టీడీపీ పాలనలోనే అభివృద్ధి
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:15 AM
సామర్లకోట, జనవరి 5: తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అమలు అయ్యాయని పొలిట్బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సామర్లకోట 4వ వార్డుకు చెందిన బ్రౌన్పేట, కుమ్మరివీధి, అంబేడ్కర్ పార్క్ వీధి త దితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి బాబు ష్యూరిటీ - భవిష్య త్తు గ్యారంటీ పేరిట ప్రచార కార్యక్రమం రాజప్ప ఇంటింటా నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మే
![టీడీపీ పాలనలోనే అభివృద్ధి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎమ్మెల్యే చినరాజప్ప
సామర్లకోట, జనవరి 5: తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అమలు అయ్యాయని పొలిట్బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సామర్లకోట 4వ వార్డుకు చెందిన బ్రౌన్పేట, కుమ్మరివీధి, అంబేడ్కర్ పార్క్ వీధి త దితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి బాబు ష్యూరిటీ - భవిష్య త్తు గ్యారంటీ పేరిట ప్రచార కార్యక్రమం రాజప్ప ఇంటింటా నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరనుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పా ర్టీల కూటమిని గెలిపించాల్సిన ఆవసరం ప్రజలందరిపైనా ఉ ందని చెప్పారు. పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.