రెండు రోజులు పవన్ రోడ్షో
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:33 AM
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈనెల 29,30వ తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ శనివారం మీడియాకు తెలియజేశారు.
పిఠాపురం, ఏప్రిల్ 27: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈనెల 29,30వ తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ శనివారం మీడియాకు తెలియజేశారు. 29వ తేదీ ఉదయం 8 గంటలకు గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి రోడ్షో ప్రారంభించి కొడవలి, వన్నెపూడి, మీదుగా పిఠాపురం మండలంలోకి ప్రవేశించి వెల్దుర్తి, పి.తిమ్మాపురం, బి.కొత్తూరు, గోకివాడ, జములపల్లి, నరసింగపురం, ఎల్ఎన్పురం, విరవాడ, విరవ, మల్లాం, జల్లూరు, కందరాడ, కుమారపురం గ్రామాల మీదుగా రోడ్షో సాగుతుందని తెలిపారు. 30వ తేదీన ఉదయం 9గంటలకు చిత్రాడలో రోడ్షో ప్రారంభించి గొల్లప్రోలు పట్టణంలో కొనసాగుతుందని చెప్పారు. 29వ తేదీ రోడ్షోలో పంట పొలాలు పరిశీలించడంతో పాటు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వీర్యం కావడం వలన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటారని, రైతులు, ఆయా వర్గాల ప్రజలతో మాట్లాడతారని వివరించారు. టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పవన్ రోడ్షోను విజయవంతం చేయాలని కోరారు.