10న నిడదవోలులో చంద్రబాబు, పవన్ రోడ్షో
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:44 AM
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించనున్నారు.
![10న నిడదవోలులో చంద్రబాబు, పవన్ రోడ్షో](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజమహేంద్రవరం, ఏప్రిల్7(ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ ఒకే వేదికపై ఇద్దరూ కనిపించారు. రోడ్షో మాత్రం ఇప్పటి వరకూ నిర్వహించలేదు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారి ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. నిడదవోలులో ఈ నెల 10న రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తణుకులో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం రోడ్ మార్గాన సాయంత్రం ఏడు గంటలకు నిడదవోలులో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిడ దవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్,టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరు గుపల్లి శేషారావు ఏర్పాట్లు చేస్తున్నారు.11వ తేదీన పి.గన్నవరం, అమలా పురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్షో,సభ ఉంటుందని సమాచారం.