Share News

మూడు రోజులు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:20 AM

నిజం గెలవాలి.. కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 24నుంచి మూడు రోజుల పాటు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆమె పర్యటిస్తారు.

మూడు రోజులు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), జనవరి 20: నిజం గెలవాలి.. కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 24నుంచి మూడు రోజుల పాటు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆమె పర్యటిస్తారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా 24న కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం, 25న అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం, 26న రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు.

పర్యటన వివరాలు..

24వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు భువనేశ్వరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12.30 గంటలకు జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామం, 1.25 గంటలకు పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామం, సాయంత్రం 4.05 గంటలకు తుని రూరల్‌ మండలం తేటగుంట గ్రామం, 5.20 గంటలకు కాకినాడ నగరంలోని 26వ డివిజన్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రికి ముమ్మిడివరం నియోజకవర్గం మహిపాల చెరువు వద్ద జాతీయ రహదారి పక్కన గ్రాండ్‌ పార్క్‌ ఫంక్షన్‌ హాల్‌ ప్రాంగణంలో బస చేస్తారు.

25వ తేదీ ఉదయం 10.30 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ఎస్‌.మూలపాలెం, 11.45 గంటలకు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి, 12.25 గంటలకు అల్లవరం మండలం రెల్లుగడ్డ, 2.40 గంటలకు రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం, సాయంత్రం 5.25 గంటలకు మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నల్లూరు, 6.20 గంటలకు మండపేట మండలం పాలతోడు గ్రామంలో పర్యటిస్తారు. రాత్రికి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం చేరుకుని ఎంఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ప్రాంగణంలో బస చేస్తారు.

26వ తేదీ ఉదయం 10.25 గంటలకు బిక్కవోలు, 12.40 గంటలకు నిడదవోలు మండలం పందలపర్రు, 1.20 గంటలకు తిమ్మరాజుపాలెం, 1.55 గంటలకు తాడిమళ్ల, 3.15 గంటలకు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి, సాయంత్రం 4.30 గంటలకు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కాటవరంలో పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు మధురపూడి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.

Updated Date - Jan 21 , 2024 | 12:20 AM