Share News

ఇక్కడే ఉండి అండగా ఉంటా: సుభాష్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:02 AM

వైసీపీనాయకులు తనపై చేస్తున్న దుష్ర్పాచారాలను నమ్మవద్దని, ఇక్కడే ఉంటాను, తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటానని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.

ఇక్కడే ఉండి అండగా ఉంటా: సుభాష్‌

కె.గంగవరం, ఏప్రిల్‌ 19: వైసీపీనాయకులు తనపై చేస్తున్న దుష్ర్పాచారాలను నమ్మవద్దని, ఇక్కడే ఉంటాను, తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటానని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. శుక్రవారం రాత్రి జనసేన ఆధ్వ ర్యంలో కె.గంగవరంలో నిర్వహించిన బీజేపీ, జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వంగవీటి రంగా చూపిన విప్లవ మార్గంలో నడుస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేసే సూపర్‌సిక్స్‌ పథ కాలు ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈనెల22న నామినేషన్‌ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి తనను, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్‌ను గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ పోలిశెట్టి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయ్యా యన్నారు.సుభాష్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ఇన్‌చార్జి దూడల శంకర్‌ నారాయణ మాట్లాడుతూ సుభాష్‌ గెలుపునకు అందరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు రేవు శ్రీను, మేడిశెట్టి శేషారావు, సలాది రమేష్‌, మరివాడ చిన్నికృష్ణ, గన్ని శ్రీను, నేమాని అబ్బు, దేవరపల్లి చక్రి, చిర్రా రాజ్‌కుమార్‌, దూడల శంకర్‌నారాయణ, అవసరాల రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:02 AM