Share News

ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:59 PM

ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.

ముస్లిం మైనార్టీల అభ్యున్నతి  టీడీపీతోనే

ద్రాక్షారామ, మార్చి 22: ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. శుక్రవారం ద్రాక్షారామలో పలువురు ముస్లింలు సుభాష్‌ సమక్షంలో టీడీపీ చేరారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ మైనార్టీసెల్‌ అఽధికార ప్రతినిది ఎం.డి.బషీర్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రజాఅబ్బాస్‌, జనసేన నాయకుడు సయ్యద్‌ ఫాజిల్‌, ఎం.డి.రియాజ్‌, ఎం.డి.అల్లాఉద్దీన్‌, ఎం.డి. భాషజాన్‌, ఎం.డి.రిపీ, ఎం.డి.మున్వారా పాల్గొన్నారు. అంత కుముందు జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మహ మ్మద్‌ మీరాన్‌ షరీఫ్‌ రామచంద్రపురం పట్టణం, ద్రాక్షారామలో సుభాష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Updated Date - Mar 22 , 2024 | 11:59 PM