విరవాడలో దారుణహత్య
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:38 AM
పిఠాపురం మండలం విరవాడలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
![విరవాడలో దారుణహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పిఠాపురం రూరల్, జనవరి 11: పిఠాపురం మండలం విరవాడలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన సిద్ధాంతపు అప్పారావు విరవాడలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. అక్కడ భార్య చిన్నారి, ఇద్దరు పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా నివాసముంటున్నాడు. ఇంట్లో అప్పారావు నిద్రిస్తుండగా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. భార్య కేకలు వేయడంతో సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా అప్పా రావు, సురేష్కు గతంలో ఖమ్మంలో ఇటుక బట్టీలో కలిసి పనిచేసే సమయంలో పరిచయం ఏర్ప డింది. వీరిద్దరికి గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు చెబుతున్నారు. ఒక మహిళతో సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని సమాచారం. సంఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ గుణశేఖర్ పరిశీలించారు.