Share News

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే వేగుళ్ల చాలెంజ్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:54 AM

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే వేగుళ్ల చాలెంజ్‌

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే వేగుళ్ల చాలెంజ్‌

కపిలేశ్వరపురం, ఫిబ్రవరి 12: టేకి, మాచర, కోరుమిల్లి, వాకతిప్ప, నాగులచెరువు, అద్దంకివారిలంక వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమిఅభివృద్ధి జరిగిందో చెప్పాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చాలెంజ్‌ విసిరారు. సోమవారం టేకిలో గ్రామటీడీపీ అధ్య క్షుడు మేడిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బీసీ జయ హో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1994నుంచి 2004 వరకు రామచంద్రపురం అధికార పార్టీ శాసనసభ్యునిగా ఉండి, ఆ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆరు గ్రామాల్లో ఏమి అభివృద్ధి సాధించారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో ఈ ఆరుగ్రామాల్లో ఆయనకంటే తక్కువ అభివృద్ధి చేసి ఉంటే ఈఎన్నికల్లో పోటీచేయనని ఎమ్మెల్యే వేగుళ్ల చాలెంజ్‌ చేశారు. అనంతరం బాబూ ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేగుళ్ల పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్‌, కొప్పిశెట్టి వాసు, గుడాల జయబాబు, కాదా వెంకటరాంబాబు, కుక్కల రామారావు, వాసంశెట్టి సత్యనారాయణ, మేడిశెట్టి శ్రీను, చింతపల్లి రామకృష్ణ, వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్ధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:54 AM