Share News

జగనన్న ఆరోగ్యశ్రీ శిబిరాన్ని అడ్డుకున్న సర్పంచ్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:48 AM

జగనన్న ఆరోగ్యశ్రీ శిబిరాన్ని అడ్డుకున్న సర్పంచ్‌

జగనన్న ఆరోగ్యశ్రీ శిబిరాన్ని అడ్డుకున్న సర్పంచ్‌

రెండు గంటలు ఆలస్యంగా క్యాంపు ప్రారంభం

అంబాజీపేట, ఫిబ్రవరి 27: పంచాయతీ కార్యదర్శి నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని కె.పెదపూడిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్యశ్రీ శిబిరాన్ని సర్పంచ్‌ బీర శాంతి, వార్డు సభ్యుడు బీర రాజారావు అడ్డుకున్నారు. పంచాయతీ కార్యదర్శి విత్తనాల వెంకటరమణ క్యాంపు వద్దకు వచ్చే వరకూ శిబిరాన్ని ప్రారంభించవద్దని వైద్యశాఖ అధికారులను అడ్డుకున్నారు. దీంతో శిబిరం వద్దకు వచ్చిన రోగులు, గ్రామస్ధులు సర్ప ంచ్‌, వార్డు సభ్యుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి కోసం క్యాంపు ఆపడం ఎంత వరకు సమజసమని ప్రశ్నించారు. దీంతో జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి సర్పంచ్‌, వార్డు సభ్యుడితో మాట్లాడి క్యాంపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఆరోగ్య శిబిరం వద్దకు వచ్చిన వృద్ధులు, రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. వైద్య శిబిరం వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో స్ధానికులే టెంట్లు, టీ, భోజనాలు ఏర్పాటు చేసినట్లు స్ధానికులు తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 12:48 AM