Share News

మైనార్టీలను అభివృద్ధిచేసింది టీడీపీయే

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:01 AM

మైనార్టీలను అన్నివిధాలా అభివఽృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌లు అన్నారు.

మైనార్టీలను అభివృద్ధిచేసింది టీడీపీయే

స్లాటర్‌ హౌస్‌కు 35కేవీ జనరేటర్‌ అందజేతలో ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 10: మైనార్టీలను అన్నివిధాలా అభివఽృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌లు అన్నారు. రాజమహేంద్రవరం రోడ్డులోని స్లాటర్‌ హౌస్‌కు బుధవారం తమ భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున 35కేవి జనరేటర్‌ను వారు అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో నగరంలో ఒక్క షాదీఖాన నిర్మించలేదన్నారు. మసీదుల అభివృద్ధి చేయలేదు కాని ఎన్నికల ముందు వచ్చి ముస్లీంల కోసం అది చేస్తాను, ఇది చేస్తామంటూ ఎంపీ భరత్‌ రామ్‌ హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. మీటింగులు పెట్టి బలవంతంగా జాయినింగ్‌లు చేసి మైనార్టీలను మోసం చేయడం అంతనికే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నూర్‌బాషా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సుభాన్‌, మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఛాన్‌ బాషా, టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతి సుందరి, పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు మహబూబ్‌ జానీ, కార్యదర్శి మహబూబ్‌ ఖాన్‌, టీడీపీ నగర కార్యదర్శి లాల్‌ఖాన్‌, టిఎన్‌టీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మిస్కా జోగినాయుడు, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బషీర్‌, షేక్‌ మదీనా సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 01:01 AM