చంద్రబాబు బహిరంగ సభకు స్థల పరిశీలన
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:55 PM
తుని రూరల్, జనవరి 3: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10న కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తునిలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని టీడీపీ నేతలైన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్వీ
![చంద్రబాబు బహిరంగ సభకు స్థల పరిశీలన](https://media.andhrajyothy.com/media/2023/20231205/3_Tuni_rural2_0b7e17e330.gif)
తుని రూరల్, జనవరి 3: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10న కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తునిలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని టీడీపీ నేతలైన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ తుని డిగ్రీ కళాశాల ఎదురుగా గల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అయ్యాయో వివరిస్తూ జిల్లా ప్రజల్లో మనోధైర్యం నింపేందు కు చంద్రబాబు ఈ సభలో ప్రసంగించనున్నట్టు తెలిపారు.