Share News

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:58 PM

కరప, మార్చి 22: టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాలతో ఎన్నడూలేని రీతిలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయ డం జరుగుతుందని టీడీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ పిల్లిసత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, కాకినాడ రూరల్‌ జనసేన ఉమ్మ

ప్రజా సంక్షేమానికి పెద్దపీట
అనంతలక్ష్మి, నానాజీలకు హారతులిస్తున్న మహిళలు

కరప, మార్చి 22: టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాలతో ఎన్నడూలేని రీతిలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయ డం జరుగుతుందని టీడీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ పిల్లిసత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, కాకినాడ రూరల్‌ జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం మండలంలోని గొడ్డటిపాలెంలో ఉమ్మడి పార్టీల నాయకులతో కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వా రు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభి వృద్ధి, సంక్షేమాన్ని చూచి జనసేన-టీడీపీ అభ్యర్థి పంతం నానాజీకి గ్లాసుగుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. టీడీపీ కో కోఆర్డినేటర్‌ కటకంశెట్టి బాబీ, దేవు వెంకన్న, బండారు మురళీ, గుల్లిపల్లి శ్రీనివాసరావు, కరెడ్ల గోవిందు, చుండ్ర వెంకన్నరాయచౌదరి, కోటగిరి మహేంద్రబాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:58 PM