వైసీపీ పతనం ఖాయం
ABN , Publish Date - Apr 26 , 2024 | 12:03 AM
కూరాడ (కరప), ఏప్రిల్ 25: ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పతనమవడం ఖాయమని టీడీపీ కాకినాడ రూరల్ కో-ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కరప మండలం కూరాడ గ్రామంలో గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిం
రేపటి పవన్ బహిరంగ సభను విజయవంతం చేయండి :
మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులు
కూరాడ (కరప), ఏప్రిల్ 25: ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పతనమవడం ఖాయమని టీడీపీ కాకినాడ రూరల్ కో-ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కరప మండలం కూరాడ గ్రామంలో గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలనువివరిస్తూ కూటమికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పంతం నానాజీ, తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ ఈనెల 27న కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించే భారీ బహిరంగ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సమష్టి కృషితో వైసీపీని అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో జనసేన నేత పంతం నానాజీ, ఆయా పార్టీల నాయకులు బండారు మురళి, వెలుగుబంట్ల సూరిబాబు, మద్దూరి స్వామి, చీపురుపల్లి జయేంద్రబాబు, మేడిశెట్టి పట్టాభి, తలాటం సతీష్ తదితరులు పాల్గొన్నారు.