Share News

‘జగన్‌ పాలనలో కుదేలైన వ్యవసాయ రంగం’

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:27 AM

కరప, ఏప్రిల్‌ 17: జగన్‌ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.20వేలు వంతున ఏటా రైతులకు పెట్టుబడి సాయమందిస్తామని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. మండలంలోని పెనుగుదురులో బుధవారం టీడీపీ

‘జగన్‌ పాలనలో కుదేలైన వ్యవసాయ రంగం’

కరప, ఏప్రిల్‌ 17: జగన్‌ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.20వేలు వంతున ఏటా రైతులకు పెట్టుబడి సాయమందిస్తామని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. మండలంలోని పెనుగుదురులో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్య ర్థులు తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, పంతం నానాజీలను గెలిపించాలని కోరారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పంతం సందీప్‌, తుమ్మలపల్లి మాచరరావు, రెడ్డిపల్లి నారాయణరావు, బండారు మురళి, గంటా మల్లేశ్వరస్వామి, పులపకూర మహేష్‌ ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:27 AM