Share News

‘వైసీపీకి రాజకీయ సమాధి కట్టాలి’

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:28 AM

కరప, ఏప్రిల్‌ 12: అడుగడుగునా ప్రజావంచన చేసిన అధికార వైసీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు రాజకీయ సమాధి కట్టాలని కాకినాడరూరల్‌ టీడీపీ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబు పిలుపునిచ్చారు. కరప మండలం వలసపాకల గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన నేత పంతం సందీప్‌

‘వైసీపీకి రాజకీయ సమాధి కట్టాలి’

కరప, ఏప్రిల్‌ 12: అడుగడుగునా ప్రజావంచన చేసిన అధికార వైసీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు రాజకీయ సమాధి కట్టాలని కాకినాడరూరల్‌ టీడీపీ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబు పిలుపునిచ్చారు. కరప మండలం వలసపాకల గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జనసేన నేత పంతం సందీప్‌లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్‌ సిక్స్‌ మ్యానిఫెస్టోను వివరించి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌లకు మద్దతుగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేయాలని అభ్యర్థించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చుండ్రు వెంకన్నరాయచౌదరి, బోగిరెడ్డి గంగాధర్‌, బోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, వాసంశెట్టి వెంకటరమణ, ఆంజనేయులు, పలివెల జానకిరామయ్య, మద్దూరి స్వామి, దూడల నారాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:28 AM