Share News

మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి : ఆర్డీవో

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:14 AM

సర్పవరం జంక్షన్‌, మార్చి 25: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఎలకో్ట్రల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ఆర్డీవో ఇట్ల కిషోర్‌ ఆదేశించారు. సోమవారం కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట, 48వ డివిజన్‌ పరిధిలో గల ఎస్‌.అచ్చుతా

మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి : ఆర్డీవో
పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో కిషోర్‌

సర్పవరం జంక్షన్‌, మార్చి 25: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఎలకో్ట్రల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, ఆర్డీవో ఇట్ల కిషోర్‌ ఆదేశించారు. సోమవారం కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట, 48వ డివిజన్‌ పరిధిలో గల ఎస్‌.అచ్చుతాపురంలో పోలింగ్‌ కేంద్రాలను తహశీల్దార్‌ బి.విజయప్రసాద్‌తో కలసి పరిశీలించారు. నియోజకవర్గంలో 264 పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. డిప్యూటీ తహశీల్దార్‌ సురేష్‌, బీఎల్వోలు ఉన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:14 AM