ఓటింగ్ సరళిపై క్టస్టర్ వారీగా కొండబాబు సమీక్ష
ABN , Publish Date - May 18 , 2024 | 11:50 PM
కాకినాడ సిటీ, మే 18: నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ సరళిపై క్లస్టర్ వారీగా కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు సమీక్ష చేశారు. శనివారం తన నివాసంలో క్లస్టర్ వారీగా డివిజన్ ఇన్చార్జ్లు, బూత్ ఇన్జార్జ్లు, క్లస్టర్ ఇన్జార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సం
![ఓటింగ్ సరళిపై క్టస్టర్ వారీగా కొండబాబు సమీక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కాకినాడ సిటీ, మే 18: నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ సరళిపై క్లస్టర్ వారీగా కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు సమీక్ష చేశారు. శనివారం తన నివాసంలో క్లస్టర్ వారీగా డివిజన్ ఇన్చార్జ్లు, బూత్ ఇన్జార్జ్లు, క్లస్టర్ ఇన్జార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ వారీగా జరిగిన ఓటింగ్ సరళి, ఇతరత్రా అంశాలపై సమీక్ష జరిపారు. ఆయా ప్రాం తాల్లో నమోదైన ఓటింగ్ శాతం, టీడీపీ కూటమికి వచ్చే మెజారిటీ వంటి అంశాలను నమోదు చేసుకున్నారు. సమావేశంలో పార్టీ నగర కమిటీ నాయకులు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.