‘మెరుగైన వైద్య సేవలందించాలి’
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:50 PM
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 20: గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించాలని డీఎంహెచ్వో డాక్టర్
![‘మెరుగైన వైద్య సేవలందించాలి’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 20: గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ నరసింహనాయక్ కోరారు. మంగళవారం పండూరు పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించాలని, హైరిస్క్ గర్భిణుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. ఆసుపత్రి, మందుల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.