Share News

అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:30 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 18: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాద్దిక్‌ అహ్మద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అకౌంటింగ్‌ సిబ్బంది, నోడల్‌ అధికారులతో ఆయన కలెక్టర్‌ జె.నివాస్‌తో సమావేశమ

అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సాద్దిక్‌ అహ్మద్‌

వ్యయ పరిశీలకులు సాద్దిక్‌ అహ్మద్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 18: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాద్దిక్‌ అహ్మద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అకౌంటింగ్‌ సిబ్బంది, నోడల్‌ అధికారులతో ఆయన కలెక్టర్‌ జె.నివాస్‌తో సమావేశమయ్యారు. అహ్మద్‌ మాట్లాడుతూ నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి అభ్యర్థుల ఖర్చులను లెక్కించాలన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు యోగేష్‌కుమార్‌, ఆషీఫ్‌, నోడల్‌ అధికారి భరణి, డీపీవో భారతి సౌజన్య పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ సందర్శన

ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన ముగ్గురు వ్యయ పరిశీలకులు కాకినాడ కలెక్టరేట్‌ స్పందన హాలులో జిల్లా కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ను గురువారం సందర్శించారు. దీనిలో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయపరిశీల కులు సాద్దిక్‌ అహ్మద్‌, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌ పరిశీలకులు యోగేష్‌కుమార్‌, పెద్దాపు రం, కాకినాడసిటీ, జగ్గంపేట వ్యయపరిశీలకులు ఆషీఫ్‌లు ఉన్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌ సమక్షంలో కంట్రోల్‌ రూమ్‌ పరిశీలించారు. 1950, కాల్‌సెంటర్‌, హెల్ప్‌డెస్క్‌, సువిధ, చెక్‌పోస్ట్‌ల వెబ్‌కాస్టింగ్‌, న్యూస్‌ ఛానల్స్‌ మోనట రింగ్‌, సీవిజల్‌ యాప్‌ల పనితీరు పరిశీలించారు. అంతకు ముందు వారు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Apr 19 , 2024 | 12:30 AM