‘స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత కల్పించాలి’
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:20 AM
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 13: ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత కల్పించాలని కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ జె.వెంకటరావు ఆదేశించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మెక్లారిన్ స్కూల్ ఆవరణలోని డిస్ట్రిబూటర్ కేం
![‘స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత కల్పించాలి’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 13: ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత కల్పించాలని కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ జె.వెంకటరావు ఆదేశించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మెక్లారిన్ స్కూల్ ఆవరణలోని డిస్ట్రిబూటర్ కేంద్రం, జేఎన్టీయూకేలోని స్ట్రాంగ్రూమ్లను సందర్శించారు. ఎన్నికల కమిషనర్ నిబంధనల ప్రకారం ఆయా కేంద్రాల్లో పూర్తి భద్రత ఉందో లేదో పరిశీలించారు. చిన్నచిన్న సమస్యలు, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ఎస్ఈ పి.సత్యకుమారి, ఏఈ రమేష్, తహసీల్దార్ దొర, డిప్యూటీ తహసీల్దార్లు సీతాపతిరావు, నాయుడు, పవన్, సర్వేయర్ ఆచార్యులు తదితరులున్నారు.