ఇంటింటి సర్వే కొనసాగించాలి
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:54 PM
తొండంగి, జూన్ 28: డయేరియా రోగులను గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్కేను మరి కొంతకాలం కొనసాగించాలని డీఎంఅండ్హెచ్వో నరసింహనాయక్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని కొమ్మనాపల్లి, బెం డపూడి గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటించారు. గతం లో మూసివేసి ఇ
తొండంగి, జూన్ 28: డయేరియా రోగులను గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్కేను మరి కొంతకాలం కొనసాగించాలని డీఎంఅండ్హెచ్వో నరసింహనాయక్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని కొమ్మనాపల్లి, బెం డపూడి గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటించారు. గతం లో మూసివేసి ఇటీవల విడుదల చేసిన తాగునీటి శాంపిళ్లను సేకరించారు. ఆయన మాట్లాడుతూ రో జూ ఉదయం, సాయంత్రం ఇంటింటి సర్వే చేయా లన్నారు. ఎవరైనా డయేరియా లక్షణాలతో ఉంటే వె ంటనే శిబిరానికి తరలించి తక్షణం వైద్య సహాయం అందించాలన్నారు. డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో సరిత, వైద్యులు రవికుమార్, అర్చన పాల్గొన్నారు.