Share News

కడియంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీం పర్యటన

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:58 AM

కడియం పీహెచ్‌సీ పరిధిలో కడియం-2 సచివాలయాన్ని డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం మంగళవారం సందర్శించింది.

కడియంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీం పర్యటన

కడియం, మార్చి 26: కడియం పీహెచ్‌సీ పరిధిలో కడియం-2 సచివాలయాన్ని డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఐఎస్‌, ఆర్‌సీహెచ్‌ రక్తహీనత ఉన్న గర్భిణులు, కిశోర్‌బాలికలకు అందిస్తున్న సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. లబ్ధిదారులను స్వయంగా విచారించారు. ఆరోగ్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బృందంలో నేషనల్‌ హెల్త్‌మిషన్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ సంధ్యారాణి, డిస్ట్రిక్ట్‌ స్టేటటికల్‌ ఆఫీసర్‌ కుమారస్వామి, డీపీహెచ్‌ ఎన్‌ వసంతలక్ష్మి ఉన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.మణిజ్యోత్స్న, డాక్టర్‌ ఎన్‌.నాగసాయి మౌర్య, ఆరోగ్య విస్తరణాధాకారి ఎం.రామకృష్ణ, మహిళా హెల్త్‌ సూపర్‌వైజర్‌ జి.కృష్ణకుమారి, ఏఎన్‌ఎం వై.నిర్మల, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:58 AM