Share News

‘రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే’

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:12 AM

కొత్తపల్లి, జనవరి 6: రాష్ట్రంలో రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తంగెళ్ళ ఉదయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. కొత్తపల్లి పాత తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో జనసేన నాయకుడు గవర రాంబాబు ఆఽధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.మండలంలో 17 గ్రామాల జనసైనికుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 3నెలల్లో రాష్ట్రంలో రాక్షస

‘రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే’

కొత్తపల్లి, జనవరి 6: రాష్ట్రంలో రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తంగెళ్ళ ఉదయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. కొత్తపల్లి పాత తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలో జనసేన నాయకుడు గవర రాంబాబు ఆఽధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.మండలంలో 17 గ్రామాల జనసైనికుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 3నెలల్లో రాష్ట్రంలో రాక్షస పాలను అంతమొందించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. వార్డు స్థాయి నుంచి వైసీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేసి జగన్‌ని గద్దె దింపాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.జనసైనికులు కొ ణమర్తి రాంబాబు, చోడిశెట్టి అప్పలరాజు, గుండ్ర రామకృష్ణ, పేపకాయల రాజు, సానా రమేష్‌, కొండపల్లి ప్రసాద్‌, వేగిశెట్టి సూర్యనికిల్‌, సానా ఆది ఎజ్జి వీరబాబు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:12 AM