Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

‘పవన్‌ని విమర్శించే స్థాయి సూర్యప్రకాశ్‌కు లేదు’

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:09 AM

సర్పవరం జంక్షన్‌, మార్చి 3: దొంగల, దోపిడీదారుల, జైలు పక్షుల పార్టీ వైసీపీ అని విమర్శించావు..టిక్కెట్‌ రాదనే ఉద్దేశంతో పార్టీ మారడం తప్పులేదు. పార్టీ మా రుతూ సీఎం జగన్‌ ప్రాపకం కోసం పవన్‌ కల్యాణ్‌ని విమర్శించే స్థాయి నీకు లేదని సూర్యప్రకాశ్‌పై జనసేన పార్టీ కాకినాడ రూరల్‌ జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వలసపాకల గంగరాజునగర్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీ తండ్రి

‘పవన్‌ని విమర్శించే స్థాయి సూర్యప్రకాశ్‌కు లేదు’

సర్పవరం జంక్షన్‌, మార్చి 3: దొంగల, దోపిడీదారుల, జైలు పక్షుల పార్టీ వైసీపీ అని విమర్శించావు..టిక్కెట్‌ రాదనే ఉద్దేశంతో పార్టీ మారడం తప్పులేదు. పార్టీ మా రుతూ సీఎం జగన్‌ ప్రాపకం కోసం పవన్‌ కల్యాణ్‌ని విమర్శించే స్థాయి నీకు లేదని సూర్యప్రకాశ్‌పై జనసేన పార్టీ కాకినాడ రూరల్‌ జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వలసపాకల గంగరాజునగర్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీ తండ్రి హరిరామజోగయ్య గుర్తింపుతో పార్టీలో పీఏసీ సభ్యుడిగా పవన్‌ అవకాశం కల్పించారన్నారు. దొంగల పార్టీ అన్న నీవు కూడా దొంగవని తేటతెల్లం చేశావని విమర్శించారు. జనసేనలో ప్రజాస్వామ్యం లేదని, ఎటువంటి చర్చ జరగదని విమర్శించడాన్ని ఆక్షేపించారు. నిడదవోలు సీటు కందుల దుర్గేష్‌కు ఖరారవుతుందన్న ఉద్దేశంతో పార్టీ మారిన నీవు ఇలా పవన్‌పై అవాకులు, చెవాకులు మాట్లాడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ మండలాఽధ్యక్షుడు కరెడ్ల గోవిందు, శిరంగు శ్రీనివాసరావు, తాటికాయల వీరబాబు, పండు నాయుడు, సోదె ముసలయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:09 AM