పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:12 AM
పిఠాపురం, ఏప్రిల్ 19: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పవన్కల్యాణ్ ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్లో శుక్రవారం సాయంత్రం చిత్రాడ, మా ధవపురం, విరవాడ గ్రామాలకు చెందిన
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు
పిఠాపురం, ఏప్రిల్ 19: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పవన్కల్యాణ్ ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్లో శుక్రవారం సాయంత్రం చిత్రాడ, మా ధవపురం, విరవాడ గ్రామాలకు చెందిన యువకులు, రైతులు, మహిళలు, వివిద వర్గాల ప్రజలు జనసేనలో చేరారు. అదేవిధంగా వైసీపీకి చెందిన పిఠాపురం ఏరియా రైస్మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఊటా జాన్బాబు, వెంకటరమణ, బుల్లిరాజు, కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఆలమూరు మాజీ సర్పంచ్ వైట్ల సత్యనారాయణమూర్తి, మాజీ ఎంపీటీసీ నామన దుర్గాప్రసాద్లు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరగా వారిని నాగబాబు ఆహ్వానించారు. నాట్య గురువుల సమస్యలు పరిష్కరించాలని శాస్త్రీయ నృత్యకళాకారుల సమాఖ్య ప్రతినిధులు నాగబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. జోగా వీరవెంకటరమణ, హరి లోకేష్ శర్మ పాల్గొన్నారు.