Share News

ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలుపుదల ప్రకటనపై ఈసీ స్పందించాలి

ABN , Publish Date - May 21 , 2024 | 11:48 PM

జగ్గంపేట, మే 21: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్‌ కమిషన్‌ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కోరారు. మంగళవారం జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసా

ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలుపుదల ప్రకటనపై ఈసీ స్పందించాలి

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, మే 21: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్‌ కమిషన్‌ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కోరారు. మంగళవారం జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా పది రోజులు పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మానవతాదృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 3 వాయిదాల్లో పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ తెలిపారు. సమావేశంలో ఎస్వీ ఎస్‌ అప్పలరాజు, కొత్త కొండబాబు, కందుల బాబ్జి, సూతి శ్రీను, మంచి కంటి శ్రీను,పాలిశెట్టి సతీష్‌ తదితరులున్నారు.

Updated Date - May 21 , 2024 | 11:48 PM