‘పోలవరం రైతులకు టీడీపీతోనే న్యాయం’
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:23 AM
జగ్గంపేట, ఏప్రిల్ 16: పోలవరం రైతులకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 11 గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు భూములిస్తామని ముందురకొచ్చిన రైతులతో నెహ్రూ మంగళవారం సమావేశం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి మాకు న్యా
![‘పోలవరం రైతులకు టీడీపీతోనే న్యాయం’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జగ్గంపేట, ఏప్రిల్ 16: పోలవరం రైతులకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 11 గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు భూములిస్తామని ముందురకొచ్చిన రైతులతో నెహ్రూ మంగళవారం సమావేశం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి మాకు న్యాయం చేస్తామని ఇప్పటికీ చేయలేదన్నారు. నెహ్రూ మాట్లాడుతూ రేపు రాబోయేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని, సమస్యలను పరిష్కరించిమీకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, పోలవరం రైతు లు, బత్తుల వెంకటరమణ, జాజుల శ్రీను, జాజుల ఫణేంద్ర, బలస ప్రకాష్, బలస సునీల్, బలస నాగేశ్వరరావు, తుల్లి రామకోటిఆనందరావు, పసుమర్తి బుజ్జి, తూతిక సతీష్, తూల్లి కృష్ణ, పిట్ల లక్ష్మి, పిట్ల నూకాలమ్మ, దిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.