Share News

జగన్‌ సభ వద్ద విషాదం

ABN , Publish Date - May 08 , 2024 | 01:05 AM

జగన్‌ ప్రచార సభ సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో విషాదఛాయలు నింపింది. జగన్‌ సభకు సమీపంలోని జంబూపట్నం జంక్షన్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వేసిన స్లాబ్‌ కూలి సింగవరం గ్రామానికి చెందిన మోర్తా శ్యాంకుమార్‌(22) మృతిచెందగా అదే గ్రామానికి చెందిన ముంగనూరి పృఽథ్వీరాజ్‌ తీవ్ర గాయలపాలై అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

 జగన్‌ సభ వద్ద విషాదం

స్లాబ్‌ కూలి వ్యక్తి మృతి

సీతానగరం, మే 7: జగన్‌ ప్రచార సభ సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో విషాదఛాయలు నింపింది. జగన్‌ సభకు సమీపంలోని జంబూపట్నం జంక్షన్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వేసిన స్లాబ్‌ కూలి సింగవరం గ్రామానికి చెందిన మోర్తా శ్యాంకుమార్‌(22) మృతిచెందగా అదే గ్రామానికి చెందిన ముంగనూరి పృఽథ్వీరాజ్‌ తీవ్ర గాయలపాలై అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం కోరుకొండ గ్రామంలో జగన్‌ సిద్ధం సభ జరిగింది. ఈ సభకు సీతానగరం మండలం సింగవరం గ్రామం నుంచి పలువురు వెళ్లారు. సభా ప్రాంగణం సమీపంలోని జంబూపట్నం జంక్షన్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఉండగా స్లాబ్‌ కూలిపోవడంతో సింగవరం గ్రామానికి చెందిన మోర్త శ్యాంకుమార్‌ మృతిచెందగా పృఽథ్వీరాజ్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోర్తా శ్యాంకుమార్‌ రాజమహేంద్రవరం ఆర్‌ ్ట్స కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా పృథ్వీరాజ్‌ కాకినాడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శ్యాంకుమార్‌ మృతిచెందడంతో సీతానగరం మండలం సింగవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Updated Date - May 08 , 2024 | 07:59 AM