జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్ధం: వేగుళ్ల
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:46 AM
జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్ధం: వేగుళ్ల
![జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సిద్ధం: వేగుళ్ల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాయవరం, ఫిబ్రవరి 27: రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని, చంద్రబాబు సీఎం కావడం ఖాయమని, టీడీపీ, జనసేన ఘన విజయం సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరరావు పిలుపునిచ్చారు. మంగళవారంరాయవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు వైసీపీ అరాచక పాలన సాగిందని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగే చంద్రబాబు, పవన్ సభకు మండపేట నియోజకవర్గం నుంచి అధికసంఖ్యలో ప్రజలు తరలిరావలని పిలుపునిచ్చారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే చంద్రబాబు హామీలను ప్రజలకు వివరించారు.
పలువురు టీడీపీలో చేరిక: రాయవరానికి చెందిన టీడీపీ నేత ఉండవిల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఎన్.రాజేష్రెడ్డి, కె.రాజు, బి.సత్యనారాయణ, వి.మహేష్, వి.రామ శ్రీనివాస్, ఐ.చి రంజీవి, ఆర్.రాజు, ఆర్.నాగేంద్ర, డి.ఏసు, ఈ.అరుణ్, కె.వెంకన్నబాబు, బి.ప్రకాష్, ఎన్.చిన్నబాబు టీడీపీలో చేరారు. వారికి వేగుళ్ల కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు వెలుగుబంట్ల గోపీకృష్ణ, బర్ల రాజు, మచ్చా సూర్యారావు, జుత్తుగ శ్రీను, కందుల గంగరాజు, వల్లూరి శ్రీనివాస్, పాలింగి చిన్నబాబు పాల్గొన్నారు.