Share News

ఇటలీ నుంచి వచ్చి.. ఆటో కొని..

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:09 AM

అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో గురువారంరాత్రి నుంచి ఇటలీ దేశస్థులు మోతుగూడెం, పొల్లూరులో సందడి చేశారు. వీరు ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చారు.

ఇటలీ నుంచి వచ్చి.. ఆటో కొని..

పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్న విదేశీయులు

పొల్లూరు ట్రైగ్రిస్‌ జలపాతం వద్ద ఇటలీవాసుల సందడి

మోతుగూడెం, జనవరి 5: అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో గురువారంరాత్రి నుంచి ఇటలీ దేశస్థులు మోతుగూడెం, పొల్లూరులో సందడి చేశారు. వీరు ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి కొచ్చిలోని ప్రకృతి అందాలను చూస్తూ కాలం గడిపారు. తర్వాత ఆటో కొనుగోలుచేసి కొచ్చి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజుజిల్లా మోతుగూడెం ప్రాంతంలోని ప్రకృతి అందాలను చూడ్డానికి వచ్చామన్నారు. మోతుగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న పొల్లూరు జలపాతం, ఫోర్‌బై కెనాల్‌, డొంకరాయి డ్యామ్‌ చూసి మేఘాలయ పయనమయ్యారు.

Updated Date - Jan 06 , 2024 | 01:09 AM