హనుమద్ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:40 AM
తూర్పు తిరుమలగా పేరొందిన బలభద్రపురంలో నిర్మించిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం మూడోరోజుకు చేరాయి.
![హనుమద్ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మూడోరోజుకు ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
బిక్కవోలు, జనవరి 7: తూర్పు తిరుమలగా పేరొందిన బలభద్రపురంలో నిర్మించిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం మూడోరోజుకు చేరాయి. ఈసందర్భంగా ఉదయం స్వామి అమ్మవార్లకు అధ్యయనోత్సవం, విశేషోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను హనుమద్ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి వారి హనుమద్ వాహనం లాగడానికి భక్తులు పోటీపడ్డారు. అనంతరం ప్రత్యేక ఉత్సవం, పక్షోత్సవం జరిపారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు మల్లిడి గంగారెడ్డి తెలిపారు.
వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
పందలపాక తుల్యభాగ నదీతీరాన ఉన్న శ్రీ అలివేలుమంగ, శ్రీపద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామివారి వార్షిక కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రతియేటా మార్గశిర బహుళ ఏకాదశినాడు నిర్వహించడం ఎన్నో యేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ సత్తి సత్తిరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.