Share News

వలంటీర్ల రాజీనామాలు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:23 AM

సామర్లకోట, ఏప్రిల్‌ 16: సామర్లకోట పట్టణ పరిధిలో 29వ వార్డుకు చెందిన నలు గురు వలంటీర్లు దూలపల్లి రాజు, సూరిశెట్టి ప్రియాంక, జీఎన్వీ రోహిణీ, మలిపిరెడ్డి వెంకటలక్ష్మి తమ విధులకు మంగళవారం రాజీనామాలు చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా సచివాలయ అడ్మిన్‌ అధికారికి రాజీనామా పత్రాలను అందజే

వలంటీర్ల రాజీనామాలు

సామర్లకోట, ఏప్రిల్‌ 16: సామర్లకోట పట్టణ పరిధిలో 29వ వార్డుకు చెందిన నలు గురు వలంటీర్లు దూలపల్లి రాజు, సూరిశెట్టి ప్రియాంక, జీఎన్వీ రోహిణీ, మలిపిరెడ్డి వెంకటలక్ష్మి తమ విధులకు మంగళవారం రాజీనామాలు చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా సచివాలయ అడ్మిన్‌ అధికారికి రాజీనామా పత్రాలను అందజేసారు.

తాళ్లరేవు: తాళ్లరేవు మండలంలోని 42మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు ఎంపీడీవో ప్రభాకరరావు తెలిపారు. పోలేకుర్రులో 20 మంది, చొల్లంగిపేటలో 18మంది, పిల్లంకలో నలుగురు వలంటీర్లు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

కొత్తపల్లి: కొత్తపల్లి మండలంలో నాగులాపల్లి, ఉప్పాడ గ్రామాలకు చెందిన 52 మంది గ్రామ వలంటీర్లు మంగళవారం రాజీనామాలు సమర్పించారని ఎంపీడీవో పి.వెంకటనారాయణ తెలిపారు. సచివాలయాల్లో రాజీనామాలను అందజేశారన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:23 AM