వలంటీర్ల రాజీనామాలు
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:23 AM
సామర్లకోట, ఏప్రిల్ 16: సామర్లకోట పట్టణ పరిధిలో 29వ వార్డుకు చెందిన నలు గురు వలంటీర్లు దూలపల్లి రాజు, సూరిశెట్టి ప్రియాంక, జీఎన్వీ రోహిణీ, మలిపిరెడ్డి వెంకటలక్ష్మి తమ విధులకు మంగళవారం రాజీనామాలు చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా సచివాలయ అడ్మిన్ అధికారికి రాజీనామా పత్రాలను అందజే
![వలంటీర్ల రాజీనామాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సామర్లకోట, ఏప్రిల్ 16: సామర్లకోట పట్టణ పరిధిలో 29వ వార్డుకు చెందిన నలు గురు వలంటీర్లు దూలపల్లి రాజు, సూరిశెట్టి ప్రియాంక, జీఎన్వీ రోహిణీ, మలిపిరెడ్డి వెంకటలక్ష్మి తమ విధులకు మంగళవారం రాజీనామాలు చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా సచివాలయ అడ్మిన్ అధికారికి రాజీనామా పత్రాలను అందజేసారు.
తాళ్లరేవు: తాళ్లరేవు మండలంలోని 42మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు ఎంపీడీవో ప్రభాకరరావు తెలిపారు. పోలేకుర్రులో 20 మంది, చొల్లంగిపేటలో 18మంది, పిల్లంకలో నలుగురు వలంటీర్లు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
కొత్తపల్లి: కొత్తపల్లి మండలంలో నాగులాపల్లి, ఉప్పాడ గ్రామాలకు చెందిన 52 మంది గ్రామ వలంటీర్లు మంగళవారం రాజీనామాలు సమర్పించారని ఎంపీడీవో పి.వెంకటనారాయణ తెలిపారు. సచివాలయాల్లో రాజీనామాలను అందజేశారన్నారు.