అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:43 AM
బాల్య విద్యతో చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు ముందుకు సాగుతున్నాయని అమలాపురం సీడీపీవో విజయకుమారి అన్నారు.
![అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమలాపురంటౌన్, జూన్10: బాల్య విద్యతో చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు ముందుకు సాగుతున్నాయని అమలాపురం సీడీపీవో విజయకుమారి అన్నారు. పేరూరు సెక్టార్ సూపర్వైజర్ కె.అన్నపూర్ణ ఆధ్వర్యంలో కామనగరువు పితానివారిపాలెం అంగన్వాడీ కేంద్రంలో సోమవారం గ్రాడ్యుయేషన్డే వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాల్య విద్య పూర్తి చేసుకున్న చిన్నారులను 1వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నట్టు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రుల సమక్షంలోవేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు కె.దుర్గాబాయి, సీహెచ్ పద్మ, యు.నిర్మలకుమారి, ఎం.వెంకటరమణమ్మ, బి.భీమాబాయి, జె.ధనలక్ష్మి, ఎన్.మంగాదేవి, జి.సరితాజ్యోతి, ఆయాలుపాల్గొన్నారు.