Share News

వైసీపీలోకి గొల్లపల్లి సూర్యారావు

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:23 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు.

వైసీపీలోకి గొల్లపల్లి సూర్యారావు

రాజోలు, ఫిబ్రవరి 28: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. రాజోలు ఎమ్మెల్యే టికెట్‌ను జనసేనకు కేటాయించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. టీడీపీకి, టీడీపీ రాజోలు ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేసిన లేఖను ఫ్యాక్స్‌ ద్వారా టీడీపీ కార్యాలయానికి గొల్లపల్లి పంపారు. వైసీపీ రాజోలు టికెట్‌ను గొల్లపల్లి ఆశిస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పనిచేశారు. మాజీ మంత్రి గొల్లపల్లితో పాటు ఆయన కుమారుడు గొల్లపల్లి శ్రీధర్‌, కొల్లాబత్తుల కుమార్‌, పితాని సూరిబాబు, చిట్టూరి సంతోష్‌ వైసీపీలో చేరారు.

Updated Date - Feb 29 , 2024 | 12:23 AM