బాలిక అదృశ్యంపై కేసు
ABN , Publish Date - May 29 , 2024 | 11:35 PM
కరప, మే 29: బాలిక అదృశ్యంపై కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు. వేళంగి గ్రామానికి చెం దిన 19ఏళ్ల బాలిక డిప్లొమా పూర్తిచేసి ఇంటి వద్దనే ఉం టుంది. కాగా ఈనెల 14వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన సదరు బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువులు,
![బాలిక అదృశ్యంపై కేసు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కరప, మే 29: బాలిక అదృశ్యంపై కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపారు. వేళంగి గ్రామానికి చెం దిన 19ఏళ్ల బాలిక డిప్లొమా పూర్తిచేసి ఇంటి వద్దనే ఉం టుంది. కాగా ఈనెల 14వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన సదరు బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువులు, స్నేహితులను విచారించగా ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదిలేక బుధవారం బాలిక తల్లి కడలి ఈశ్వరి కరప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.