తల్లిదండ్రుల వద్దకు చేరిన బాలిక
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:29 AM
పిఠాపురం రూరల్, ఆగస్టు 23: తప్పిపోయిన బదిర(డఫ్ అండ్ డమ్) బాలిక తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈలోగా తమ కుమార్తెపై ఎవరో అఘాత్యం చేసి ఉంటా రని తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి అటువంటిది ఏమిలేదని తేల్చారు. పిఠాపురం మండలం కందరాడకు చెందిన బదిర బాలిక దుర్గాభవానీ ఈనెల 20న ఇంటి నుంచి తప్పిపోయింది. 21న సాయం త్రం పట్టణంలోని జీవన్నగర్లో తిరుగుతుండగా, స్థానికులు ఆరా
పిఠాపురం రూరల్, ఆగస్టు 23: తప్పిపోయిన బదిర(డఫ్ అండ్ డమ్) బాలిక తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈలోగా తమ కుమార్తెపై ఎవరో అఘాత్యం చేసి ఉంటా రని తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి అటువంటిది ఏమిలేదని తేల్చారు. పిఠాపురం మండలం కందరాడకు చెందిన బదిర బాలిక దుర్గాభవానీ ఈనెల 20న ఇంటి నుంచి తప్పిపోయింది. 21న సాయం త్రం పట్టణంలోని జీవన్నగర్లో తిరుగుతుండగా, స్థానికులు ఆరా తీశారు. వివరాలు చెప్పలేకపోవడంతో ఆ ప్రాంతానికి చెందిన డేవిడ్ తన ఇంటికి తీసుకెళ్లి రాత్రి ఉంచా రు. 22న ఉదయం 5గంటలకే ఎవరికి చెప్పకుండా ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయి ంది. సాయిబాబు గుడి సెంటర్లో ఆటో డ్రైవర్ గుర్తించి ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమార్తెను ఎవ్వరో కావాలనే తీసుకువెళ్లారని, అఘాత్యం చేసి ఉండవచ్చని తండ్రి పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిఠాపురం ఎస్ఐ గుణశేఖర్ కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. అటువంటిది ఏమి జరగలేదని శనివారం తేల్చారు.