ఫైనాన్స్ కంపెనీలో రూ.12 లక్షలు చోరీ
ABN , Publish Date - Mar 09 , 2024 | 12:12 AM
ఫైనాన్స్ కంపెనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇన్నీసుపేట పాత స్టేట్బ్యాంకు మొదటి అంతస్తులో ఒక ఫైనాన్సు కంపెనీ కార్యాలయం ఉంది.
రాజమహేంద్రవరం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : ఫైనాన్స్ కంపెనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇన్నీసుపేట పాత స్టేట్బ్యాంకు మొదటి అంతస్తులో ఒక ఫైనాన్సు కంపెనీ కార్యాలయం ఉంది. అందరూ శివరాత్రి హడావుడిలో ఉండగా అగంతకులు శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమ యంలో ఇనుపరాడ్డుతో షట్టరును బలవంతంగా మనిషి దూరే ఎత్తుకు పైకిలేపి లోనికి ప్రవేశించారు. లోపల టేబుల్ సొరుగు తాళాన్ని స్ర్కూడ్రైవర్లతో తొలగించి సుమారు రూ.12 లక్షల నగదును అపహరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వాళ్ల ఫొటోలను ఎస్పీ జగదీశ్ మీడియాకు విడుదల చేశారు. దొంగల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 వేల బహుమతి అంద జేస్తామని ప్రకటించారు. టూటౌన్ సీఐ ఫోన్ 9440796576 లేదా సౌత్జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ ఫోన్ 9490760791కి సమాచారం అందించాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంతా ఉంచుతామన్నారు.