అభివృద్ధి, సంక్షేమమే కూటమి లక్ష్యం: బండారు
ABN , Publish Date - Apr 26 , 2024 | 12:15 AM
అభివృద్ధి సంక్షేమమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఏడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూట్టారు.
ఆత్రేయపురం, ఏప్రిల్ 25: అభివృద్ధి సంక్షేమమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఏడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూట్టారు. వసంతవాడలో వైసీసీ సీనియర్ నాయకుడు పేరిచర్ల జగ్గరాజు, వాడపల్లిలో సీనియర్ వైసీపీ నాయకుడు యేపుగంటి దుర్గారావులు తమ అనుచరులతో ప్రజాగళం ప్రచారయాత్రలో టీడీపీలో చేరారు. వారందరికి బండారు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కృషిచేస్తామన్నారు. అవినీతి ప్రభుత్వం పోవాలంటే సైకిల్ ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, మెర్లపాలెం సర్పంచ్ మెర్ల రాము, అల్లు వెంకటరమణ, దొడ్డపనేని వెంకట్రావు, దండు రాంబాబు పాల్గొన్నారు.